ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యేలు
17 Mar, 2017 13:37 IST
నెల్లూరుః స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయ్కుమార్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్రెడ్డి పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో కలిసివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.