బెట్టింగ్ల కోసమే లగడపాటి సర్వే ఫలితాలు
15 May, 2014 14:01 IST
హైదరాబాద్:
లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే ఫలితాలు బెట్టింగ్ల కోసమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానంటున్న లగడపాటి.. సంపాదనే లక్ష్యంగా బెట్టింగ్ వ్యాపారం మొదలు పెట్టారని, అందులో భాగంగానే సర్వేలంటూ చిలక జోస్యం చెబుతున్నారని గట్టు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీమాంధ్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయని తెలిసిన తర్వాత ఆ పార్టీ గెలుస్తుందని లగడపాటి భారీగా బెట్టింగ్లు కాశారని, దీనికి సంబంధించిన స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉందని గట్టు అన్నారు. అయితే, బెట్టింగ్ కోసం టీడీపీ వాళ్లు ముందుకు రాకపోయేసరికి వారిని నమ్మించేందుకు లగడపాటి ఒక హైప్ సృష్టిస్తున్నారని గట్టు రామచంద్రరావు ఆరోపించారు.