భుట్టోకు కొడాలి నాని పరామర్శ

7 Jun, 2017 18:48 IST

కట్టవానిచెరువు(గుడ్లవల్లేరు): గ్రామ సర్పంచి అబ్దుల్‌ లతీఫ్‌(భుట్టో)ఇటీవల మాతృవియోగానికి గురయ్యారు. గుడ్లవల్లేరులోని ఆయన నివాసంలో బుధవారం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పరామర్శించారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ నేతలు దుక్కిపాటి శశిభూషణ్, కృష్ణారావు, మహారెడ్డి మురళి, కిశోర్‌నాయుడు ఉన్నారు.