ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన కిడ్నీ బాధితులు లోటస్ పాండ్ లో వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను కలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నా ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కోసారి రూ. 4వేలు ఖర్చవుతోందని, ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదని వాపోయారు.