మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పరామర్శ
22 Feb, 2017 17:47 IST
అనంతపురం: ధర్మవరం మార్కెట్వీధిలో నివసిస్తున్న ఆచారి అనారోగ్యంతో మృతిచెందడంతో వారి కుటుంబాన్ని బుధవారం వైయస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరామర్శించారు. ఆచారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచారి మృతి తీరనిలోటని వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఆచారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో గోల్డ్ ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.