గుంటూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తిగా గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి ‘అదే బాట’ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని పాత పాటేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మ్రరి రాజశేఖర్, నాయకులు కావటి మనోహర్నాయుడు, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, జెడ్పీ ప్లోర్ లీడర్ దేవండ్ల రేవతి తదితరులు పాల్గొన్నారు.