కాంగ్రెస్, టిడిపి నుంచి రెండువేల మంది చేరిక
25 May, 2013 18:20 IST
భీమవరం (ప.గో.జిల్లా),
25 మే 2013: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ల నుంచి రెండు వేల మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసమర్థ, ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు, దానితో అంట కాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రస్థానం పాదయాత్ర శనివారం 159వ రోజు భీమవరం నియోజవకర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.