'రాజధాని భూమిపూజను కుటుంబ ఫంక్షన్ గా మార్చేశారు'

6 Jun, 2015 16:37 IST
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధాని భూమిపూజను 'కుటుంబ ఫంక్షన్'గా మార్చేశారని వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన తనకు భూమిపూజ ఆహ్వానం రాలేదని మండిపడ్డారు. ఆ కార్యక్రమానికి ప్రతిపక్ష నాయకుడిని కూడా సీఎం కానీ, సీఎస్ కానీ ఆహ్వానించలేదు. దీన్ని బట్టి చంద్రబాబుది నీచ సంస్కృతి ఏంటో తెలుస్తుందన్నారు.

శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు భూమిపూజ కార్యక్రమానికి అటెండర్తో కార్డు పంపించి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు కూడా ఇస్తామని జ్యోతుల ఈ సందర్భంగా తెలియజేశారు. సమైక్య ఉద్యమకారుల్ని కూడా భూమి పూజకు ఆహ్వానించకపోవడం దారుణమని జ్యోతుల మండిపడ్డారు.