జులై 2కు నయవంచన దీక్ష వాయిదా
26 Jun, 2018 19:29 IST
అనంతపురం: టీడీపీ వంచనపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యం ఈ నెల 30న తలపెట్టిన గర్జన కార్యక్రమం జులై 2వ తేదీకి వాయిదా వేసినట్లు వైయస్ఆర్సీపీ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, శంకర్నారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలులో టీడీపీ, బీజేపీ నాయకులు చేసిన మోసాలను ఎండట్టేందుకు వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే విశాఖ, నెల్లూరు నగరాల్లో నయవంచన దీక్షలు చేపట్టారు. అనంతపురంలో జులై 2న నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.