జూపూడి తల్లికి విజయమ్మ పరామర్శ
10 Oct, 2012 03:29 IST
హైదరాబాద్, 10 అక్టోబర్ 2012: అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు తల్లిని పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బుధవారం పరామర్శించారు. జూపూడి తల్లిని పరామర్శించిన విజయమ్మ క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో జూపూడి తల్లి కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్నారు.