రెండవరోజుకు చేరిన పాదయాత్ర
27 May, 2017 12:10 IST
అనంతపురంః శింగనమల నియోజకవర్గం వైయస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర రెండవ రోజుకు చేరుకుంది. రైతు, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మొద్దు నిద్రపోతున్న సర్కార్ ను ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. ఆమె వెంట భర్త సాంబశివారెడ్డితో పాటు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు.