జనసంద్రంగా మారిన నెక్లెస్రోడ్
27 May, 2013 18:49 IST
హైదరాబాద్, 27 మే 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్బంధాన్ని నిరసిస్తూ నెక్లెస్రోడ్లోని పీపుల్సు ప్లాజా వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చారు. శ్రీ జగన్కు మద్దతుగా భారీగా వచ్చిన జనంతో నెక్లెస్రోడ్ అభిమాన సంద్రంగా మారింది.
పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీ జగన్ సతీమణి శ్రీమతి వైయస్ భారతి, వైయస్ అవినాష్ రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, పుత్తా ప్రతాప్రెడ్డి, విజయారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. వేదిక దగ్గరకు వచ్చిన శ్రీ జగన్ కుటుంబ సభ్యులను అభిమానులు చుట్టుముట్టారు.