కాకినాడలో మార్మోగిన జై జగన్..కాబోయే సీఎం జగన్ నినాదాలు

27 Aug, 2017 15:59 IST

కాకినాడః అనారోగ్యం బాధిస్తున్నాలెక్కచేయకుండా జనమే ఆశ, శ్వాసగా భావించి వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ కాకినాడలో ప్రజలతో మమేకమవుతున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా వైయస్ జగన్ డెయిర్ ఫాం సెంటర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జననేతను చూసేందుకు ప్రజలు కాకినాడకు పోటెత్తారు. జై జగన్, కాబోయే సీఎం జగన్ నినాదాలతో కాకినాడ మార్మోగుతోంది.