జగనన్న వస్తే బీడీ కార్మికుల కష్టాలు తీరుతాయి
1 Dec, 2012 19:29 IST

కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై జగనన్నను అన్యాయంగా జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల అన్నారు. జగనన్నబయటకు వచ్చి రాజన్న రాజ్యం తీసుకు వస్తారన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మీ కష్టాలన్నీ తీరుతాయని, బీడీ కార్మికులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.
వైయస్ఆర్ కడప జిల్లాలో అక్టోబర్ 18న శ్రీమతి షర్మిల ప్రారంభించిన పాదయాత్ర కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల మీదుగా మహబూబ్ నగర్ జిల్లాలో 45వ రోజు కొనసాగింది. పాలమూరు జిల్లాలో శనివారం తొమ్మిదో రోజు ఆమె 18.6 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు శ్రీమతి షర్మిల 624.6 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. రాత్రికి నెల్లికొండి గ్రామ శివారులో షర్మిల బస చేశారు.