30న జగన్‌కు గవర్నరు అపాయింట్‌మెంట్

26 Sep, 2013 17:13 IST
హైదరాబాద్ 26 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి గవర్నరు నరసింహన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 30 సాయంత్రం 4 గంటలకు శ్రీ జగన్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను  కలవనున్నారు. తెలంగాణపై కేంద్రం తీర్మానం పంపడానికి ముందే రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచి... సమైక్య తీర్మానం చేయాలని తమ పార్టీ  డిమాండ్‌ చేస్తోందని అంతకుముందు పార్టీ శాసన సభ పక్ష ఉప నాయకురాలు శ్రీమతి భూమా శోభా నాగిరెడ్డి చెప్పారు.