సివిల్స్ టాపర్ కు వైయస్ జగన్ అభినందన

19 May, 2018 14:21 IST

సివిల్ సర్వీసెస్ లో రాష్ట్ర టాప్ ర్యాంకర్ పృధ్వీతేజ్ ను   వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల వెల్లడైన ఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 24 వర్యాంకు, ఎపిలో 1వ ర్యాంకు సాధించిన పృధ్వీతేజ్  తన తండ్రితో కలిసి నల్లజెర్లలో ప్రజా సంకల్పయాత్ర  శిబిరంలో జగన్ ను కలుసుకున్నారు. గతంలో ఐఐటిలోనూ ట్యాప్ ర్యాంకు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, పృథ్వీ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని జగన్ ఆకాంక్షించారు.