టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లోఐటీ సోదాలు, కోట్లలో నగదు లభ్యం
16 Dec, 2015 23:43 IST
మహబూబ్ నగర్: మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇంటిపై బుధవారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఎకకాలంలో ఆయన ఇళ్లు, కార్యాలయంలో రైడ్ చేసిన అధికారులు రూ. 18కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన సొమ్మును ఆఫీస్ లాకర్లో పెట్టినట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు సోదాలు చేశారు. .