విశాఖలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

21 Oct, 2016 13:05 IST

విశాఖపట్నంః జీవీఎంసీ ఆరో వార్డు ఎండాడకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో అనేకమంది వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయసాయిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.