ఏపీ సర్కార్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

23 Aug, 2016 18:16 IST

హైదరాబాద్ః ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. స్విస్ ఛాలెంజ్ విధానం దేనికోసమని నిలదీసింది. ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న వ్యవహారాన్ని ఇంత  దాపరికంగా ఎందుకు చేస్తున్నారు. విదేశీయుల కోసమే కదా. ఇష్టారాజ్యంగా చేయడానికి ఇది అధికారుల ప్రైవేటు ఆస్తులా..? అని వ్యాఖ్యానించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.