దొంగలే విచారణ జరుపుతారట

13 Jun, 2017 11:34 IST

విశాఖ భూముల కుంభకోణాన్ని ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పేదలకు సంబంధించిన లక్షలాది ఎకరాలను కొల్లగొట్టిన దాంట్లో ముఖ్యమంత్రి, మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. భూ కబ్జాపై సిట్ తో విచారణ చేపడుతామన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డారు. దొంగలే విచారణ చేసి శిక్షిస్తారనడం హాస్యాస్పదమన్నారు.