విశాఖ ఎయిర్ పోర్టులో జననేతకు ఘనస్వాగతం

23 Jan, 2017 12:24 IST

విశాఖపట్నం :  ప్రతిపక్ష నేత, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ చేరుకున్నారు.  ఎయిర్‌పోర్టులో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విశాఖ నుంచి రోడ్డుమార్గం ద్వారా విజయనగరం బయల్దేరారు.

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం జరిగిన కూనేరు ఘటనా స్థలాన్ని వైయస్‌ జగన్‌ పరిశీలిస్తారు. క్షతగ్రాతులతో పాటు ప్రమాద ఘటనలో మరణించిన పాత్రబిల్లి శ్రీను, పోలిశెట్టి, మిరియాల కృష్ణ కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు.