జనసంద్రమైన ఆత్మకూరు..జననేతకు ఘనస్వాగతం
6 Jan, 2017 17:40 IST
ఆత్మకూరుః ఆత్మకూరు జన సందోహమైంది. వైయస్సార్సీపీ జెండాలు రెపరెపలాడాయి. జై జగన్ నినాదాలతో గౌడ్ సెంటర్ ప్రాంతం మారుమోగింది. ఆత్మకూరులో వైయస్సార్సీపీ నిర్వహించిన బహిరంగసభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. జిల్లాలో ఆరు రోజుల రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మకూరుకు వచ్చిన జననేతకు పార్టీనేతలు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.