గన్నవరం ఎయిర్ పోర్టులో వైయస్ జగన్కు ఘనస్వాగతం
16 Feb, 2017 10:51 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన అవసరాన్ని చాటి చెప్పడానికి గుంటూరులో నిర్వహిస్తున్న ‘యువభేరి’ లో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి వైయస్ జగన్.. రోడ్డు మార్గంలో గుంటూరుకు బయల్దేరారు. . నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు పక్కన, గతంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ జగన్ నిరాహార దీక్ష చేపట్టిన ప్రాంగణంలోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడతారు.