నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు
గొల్లప్రోలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవనత్నాల పథకంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పెండెం దొరబాబు అన్నారు. మండలంలోని ఏకే మల్లవరంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా సుబ్రహ్మణ్యస్వామి గుడిలో పూజాధికార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కన్వీనర్ అరిగెల రామయ్యదొర ఆధ్వర్యంలో గ్రామంలో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటా నవరత్నాలను వివరించారు. వైయస్ జగన్ సీఎం అయితే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమపధకాలను తెలియచేశారు. మాటమీద నీలబడే వ్యక్తి వైయస్ జగన్ అని ప్రజలకు నొక్కి చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాలను , ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనాన్ని వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అరిగెల మణిబాబు, వింజరపు బుల్లిబాబు, మణుగుల వీరబ్రహ్మం, పాలపర్తి సూరయ్య, తటవర్తి నందీశ్వరరావు, సిద్దా అప్పారావు, పులుగు చంద్రరావు, బోడపాటి నూకరాజు, కూరాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.