హైదరాబాద్) పార్లమెంట్ వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రజల తరపున పోరాటానికి సిద్ధమైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో
అనుసరించాల్సిన అంశాలపై పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో
శనివారం భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇతర ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వర
ప్రసాద్, బుట్టా రేణుక, మిథున్
రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. సోమవారం నుంచి మొదలవుతున్న పార్లమెంటు సమావేశాల్లో
అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి
తీసుకొని రానున్న ప్రైవేటు బిల్లు మీద అనుసరించాల్సిన వ్యూహం మీద చర్చించారు. లోక్
సభలో ఇతర పార్టీలను కలుపుకొని ఫిరాయింపు చట్టం మీద సవరణలకోసం పట్టుపట్టాలని
నిర్ణయించారు. నిస్సిగ్గుగా జరుగుతున్న ఫిరాయింపుల మీద చర్యలు
తీసుకోవాలని, చట్ట సవరణ చేయటం ద్వారా అక్రమాలకు కళ్లెం వేసే
విధంగా కేంద్రం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా మీద పార్టీ
పోరాటాన్ని ఢిల్లీ ద్రష్టికి తీసుకొని వెళ్లనున్నారు. పోలవరం వంటి పెండింగ్ ప్రాజెక్టుల కోసం పార్టీ
వంతు ప్రయత్నాలు చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న అరాచకాలు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనలు గమనిస్తూ
రాష్ట్రానికి కావలసిన అంశాల మీద ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.