చంద్రబాబు అబద్ధాలతో రైతులకు కష్టాలు: వైఎస్ జగన్

27 May, 2015 15:13 IST
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆడుతున్న అబద్ధాలతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు బూటకపు వాగ్దానాలతో రైతులు దారుణంగా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి రైతులు ఆశలు వదులుకోక ముందే వారి తరపున పోరాడతామని ట్విటర్ లో పేర్కొన్నారు. రైతుతో తాను మాట్లాడుతున్న ఫోటోను వైఎస్ జగన్ ట్విటర్ లో పోస్ట్ చేశారు.