నష్టపరిహారం అందక మనస్తాపంతో రైతు ఆత్మహత్య
10 Jun, 2017 14:35 IST
అనంతపురం: అనంతపురం ఎస్పీకుంటలో విషాదం చోటు చేసుకుంది. తన భూమికి ప్రభుత్వం నష్ట పరిహారం రాలేదని సోలార్ ప్రాజెక్టు భూ నిర్వాసితుడు మౌలా సాహెబ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాహెబ్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైయస్ఆర్ సీపీ మృతదేహంతో ధర్నాకు దిగింది.