వైయస్ జగన్ తో మమేకం అయ్యేందుకు అభిమానుల సన్నాహాలు
1 Jun, 2016 09:41 IST
అనంతపురం) ప్రతిపక్షనేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మరికాసేపట్లో అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పాల్గొనేందుకు, జననేత తో మమేకం అయ్యేందుకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సన్నాహాలు చేసుకొంటున్నారు. తాడిపత్రి నియోజక వర్గంలో వైయస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.