పశ్చిమగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ వల్లే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మోచర్ల జోహర్ వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జగన్నాథపురం వద్ద ఆమెకు కండువా కప్పి వైయస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కారుమూరి నాగేశ్వర్రావు, తదితరులు ఉన్నారు.