ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలి
4 Oct, 2017 17:53 IST
సీతమ్మధార: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ వ్యవహరాలపై నేతలతో చర్చించారు. గడపగడపకు వైయస్ఆర్ కుటుంబం, నవరత్నాలుపై సమీక్షించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రతి ఒక్కరూ పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2019లోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వైపల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.