నూతన కార్యవర్గం ఎన్నిక
13 Aug, 2016 16:22 IST
హైదరాబాద్: హైదరాబాద్: వైయస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఆయా పదవులకు నూతన నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు వైయస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ నియామకాలు చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా బోయినపల్లి శ్రీనివాసరావు(కరీంనగర్), గుండెరెడ్డి రాంభూపాల్రెడ్డి(మహబూబ్నగర్), రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పారిపెల్లి వేణుగోపాల్ రెడ్డి(కరీంనగర్), రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడుగా కె.విశ్వనాధ్చారి(రంగారెడ్డి), రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడుగా సందమల్ల నరేష్(కరీంనగర్)లు నియమితులయ్యారు.