కమిషన్ కు వివరాలు అందించిన వైయస్సార్సీపీ నాయకులు
29 Jun, 2016 22:34 IST
రాజమహేంద్రవరం)) గోదావరి పుష్కరాల తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి ఏర్పాటైన జస్టిస్ సోమయాజులు కమిషన్ కు ప్రతిపక్ష వైయస్సార్సీపీ నాయకులు కొన్ని వివరాలు అందించారు. తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితుల్ని కార్పొరేషన్ లో పార్టీ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి, లీగల్ సెల్ కన్వీనర్ వెంటాప్రగడ ఉమామహేశ్వరి వివరించారు. ఈ మేరకు కొన్ని ఆధారాలు సమర్పించారు. ముఖ్యనేతల కోసం వీఐపీ ఘాట్ ఉండగా షూటింగ్ ల కోసం చంద్రబాబు పుష్కరాల ఘాట్ కు మారారని, లేనిపక్షంలో ఎందుకు మారారు అనే దానికి కారణాలు తెలపాలని కోరారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ను ఎవరు ఖరారు చేసినదీ నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.