కరవు మండలాలుగా ప్రకటించండి..!

6 Nov, 2015 18:35 IST
కమలాపురం: వైఎస్సార్‌ జిల్లాలోని అన్ని మండలాలను తక్షణమే కరవు మండలాలుగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కమలాపురం మండలం గొల్లపల్లి గ్రామంలో వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి రూ.25 వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని రవీంద్రనాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.