డిసెంబర్ 4 నుంచి అనంతలో ప్రజా సంకల్పయాత్ర
20 Nov, 2017 14:56 IST
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర డిసెంబర్ 4వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి తెలిపారు. 15 రోజుల పాటు 220 కిలోమీటర్ల మేర జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. రోడ్డు పొడవునా అన్ని వర్గాల ప్రజలను కలుస్తారని ఎంపీ మిథున్రెడ్డి చెప్పారు.