వైయస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ నేతలు

4 Jul, 2016 12:20 IST
హైదరాబాద్ః ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. పీసీసీ అధికార ప్రతినిధి కుమార్ రాజు, ప్రత్తిపాడు కాంగ్రెస్ ఛార్జ్ చంద్రప్రసాద్, ఇతర స్థానిక నేతలు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో కేంద్ర పార్టీ కార్యాలయంలో వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా వైయస్ జగన్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.