వైయస్సార్సీపీలో చేరిన కాంగ్రెస్ నాయకురాలు

14 Jun, 2017 15:01 IST

హైదరాబాద్ః చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ వైయస్సార్సీపీలో చేరారు. వైయస్ జగన్ సమక్షంలో ఆయన నివాసంలో వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పద్మజతో పాటు పలువురు నేతలకు వైయస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె వైయస్ జగన్ కు ఫోటోను బహుకరించారు.