నిప్పు లాంటి నిజం..!

16 Jul, 2015 20:06 IST

చంద్ర‌బాబు చేసిన పాపాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. పుష్క‌రాల తొక్కిస‌లాట‌లో చంద్ర‌బాబు చేసిన నిర్వాకం బ‌య‌ట ప‌డింది. సాక్షాత్తు అక్క‌డి జిల్లా క‌లెక్ట‌ర్ అందించిన ప్రాథ‌మిక నివేదిక లో నిప్పు లాంటి నిజాలు బ‌య‌ట ప‌డ్డాయి.

పుష్క‌రాల‌కు మొద‌టి రోజునే స్నానాలు చేసేందుకు ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నాలు అక్క‌డ‌కు చేరుకొన్నార‌ని ఈ  నివేదిక‌లో పేర్కొన్నారు. ప్ర‌భుత్వం చేసిన ప్ర‌చారంతో పెద్ద ఎత్తున జ‌నం ప్రారంభ ఘ‌డియ‌ల్లోనే అక్క‌డ‌కు వచ్చేశారు. వేకువ జామునే ముఖ్య‌మంత్రి కుటుంబ స‌భ్యుల‌తో స‌హా పుష్క‌రాల రేవుకి చేరుకొన్నారు. అక్క‌డ స్నానాదికాలు చేసి పూజాదికాలు పూర్త‌య్యేస‌రికి ఎనిమిదిన్న‌ర అయ్యింది. అంటే దాదాపు రెండు గంట‌ల పాటు జ‌నాన్ని బ‌య‌ట నిలిపివేయ‌టం జ‌రిగింది. ఇంతసేపు ఆపినాక, ఒక్క‌సారిగా జ‌నాన్ని గేటు తెరిచి వ‌దిలేశారు. పెద్ద ఎత్తున ప్ర‌వాహంలా జ‌నం త‌ర‌లి వ‌స్తుంటే ఆప‌టం అక్క‌డ ఉన్న సిబ్బందికి శ‌క్తికి మించిన ప‌ని అయింది. దీంతో దుర్ఘ‌ట‌న చోటు చేసుకొంద‌ని క‌లెక్ట‌ర్ నివేదించారు.

మొత్తంమీదక‌లెక్ట‌ర్ఇచ్చిననివేదిక‌లోముఖ్య‌మంత్రిచంద్ర‌బాబుచేసిననిర్వాకంబ‌య‌టప‌డింది. రెండుగంట‌లపైగాముఖ్య‌మంత్రికుటుంబంకోసంజనాన్నిఅక్క‌డనిలిపివేయ‌టమేకొంపముంచిద‌న్నవాస్త‌వంబ‌య‌టప‌డింది. బ‌హుశాఇంతస్ప‌ష్టంగానివేదికఇచ్చినందుకుగానుముఖ్య‌మంత్రికి, ఆయ‌నకోట‌రీకికోపంరావ‌చ్చు. పుష్క‌రాలత‌ర్వాతక‌లెక్ట‌ర్మీదవేటుప‌డినాఆశ్చ‌ర్య‌పోన‌క్క‌రలేదు.