వైయస్‌ జగన్‌ను కలిసిన నటుడు పృథ్వీ

29 May, 2018 11:52 IST

పశ్చిమ గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పలువురు నేతలు వైయస్‌ జగన్‌ ప్రజల కోసం చేస్తున్న పాదయాత్రకు ఆకర్శితులవుతున్నారు. చాలా మంది నాయకులు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. ఇటీవల సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వైయస్‌ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. తాజాగా మరో సినీ నటుడు పృథ్వీ జననేతను కలిశారు. వైయస్‌ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.