చిన్నకడుబూరు చేరుకున్నపాదయాత్ర

15 Nov, 2012 11:32 IST
కర్నూలు :

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం ఇరవై తొమ్మిదో రోజుకు చేరింది. అశేష జనవాహిని మధ్య షర్మిల  గురువారం ఉదయం కర్నూలు జిల్లా రంగాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. షర్మిలను చూసేందుకు,  ఆమెతో తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. చిన్నకడుబూరు,పెద్దకడుబూరు, దొడ్డమేకల మీదగా యాత్ర సాగనుంది.