చంద్రబాబు నిర్వాకం వల్లే ఈదుస్థితి..!
29 Oct, 2015 18:00 IST
హైదరాబాద్: రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా డెల్టాకు నీరు ఇస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన వల్లే రైతులు పంటలు వేశారన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే ఇవాళ ...లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయిన దుస్థితి ఏర్పడిందన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు.