నంద్యాల: వంద మంది చంద్రబాబులు వచ్చిన వైయస్ జగన్మోహన్రెడ్డిని, శిల్పా మోహన్రెడ్డి విజయాన్ని ఆపలేరని పార్టీ నేత రెహమాన్ అన్నారు. నంద్యాల బహిరంగ సభ వేదికగా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే.... అందరం ఒక్కటై చంద్రబాబు సైకిల్కు పంచర్ చేద్దాం. ఎక్కడికి వెళ్లిన ప్రజలు వైయస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తట్టుకోలేక చంద్రబాబు ఐసీయూలో జాయిన్ అయ్యారు. శిల్పా మోహన్రెడ్డిని గెలిపించి వైయస్జగన్మోహన్రెడ్డికి కానుక ఇద్దాం. మన కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డే. అందులో సందేహం లేదు. ముస్లింలను చంద్రబాబు భయపెడుతున్నారు. వంద చంద్రబాబులు వచ్చిన జగన్ను ఆపలేరు.