కృష్ణా జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ
8 Aug, 2013 17:35 IST
విజయవాడ 08 ఆగస్టు 2013:
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంలని డిమాండు చేస్తూ కృష్ణా జిల్లావ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. జిల్లాలో సీమాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏడో రోజు నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోతే సన్యాసం తీసుకుంటానని సవాలు చేసిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామా చేయకుండా నాటకాలాడుతున్నారని ఉదయభాను విమర్శించారు.