బీఎస్పీ నాయ‌కురాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

6 Sep, 2018 11:52 IST
విశాఖ జిల్లాః  ప్రజా సమస్యలపై  వైయస్‌ జగన్‌ స్పందిస్తున్న తీరు,అలుపెరగని  యోధుడిగా ప్రజల కోసం  వేస్తున్న అడుగులకు ఆకర్షితులై  భారీ సంఖ్యలో వివిధ పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు. రోజురోజుకు వ‌ల‌స‌లు పెరగడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కలుగుంది. తాజాగా వైయస్‌ఆర్‌సీపీ అరకు సమన్వయకర్త చెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ సమక్షంలో బీఎస్పీ నాయ‌కురాలు , ఎంపీటీసీ జి.జాంబవతితో పాటు వివిధ పార్టీల నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.   వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.