పులివెందుల సభలో సీఎం తీరు బాధాకరం

4 Jan, 2018 13:17 IST
హైదరాబాద్‌:  జన్మభూమి సభలు టీడీపీ సభలుగా మారాయని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ అవినాష్‌రెడ్డిని బహిరంగ సభలో మాట్లాడకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. పులివెందుల సభలో సీఎం ప్రవర్తించిన తీరు బాధాకరమని బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. జన్మభూమి సభల్లో టీడీపీ గుండాలు వచ్చి మైకులు లాగుతారా అని నిలదీశారు.