కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

7 Apr, 2018 15:44 IST
ఢిల్లీ: ఆంధ్రులకు చేస్తున్న అన్యాయానికి కేంద్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో ప్రత్యేక హోదా సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. డిహైడ్రేషన్‌ ఎక్కువై కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితిలో ఉన్నారనే వైద్యులు తెలిపారని, డాక్టర్ల సూచనల మేరకు పోలీసులు బలవంతంగా మేకపాటిని ఆస్పత్రికి తరలించారన్నారు.