రాజ్యసభ
సభ్యులు వి.విజయసాయిరెడ్డి వెంకటేశ్వరస్వామి
చరిత్రపై గ్లోరీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అనే పేరుతో రచించిన పుస్తకాన్నిత్వరలోనే విడుదల చేయనున్నారు.
తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ భాషల్లో దీనిని విడుదల చేయనున్నామని, ఇందులో
వెంకటేశ్వర వైభవం, నివాసం, ఆచారాలు, సంప్రదాయాలకు సంబంధించి అంశాలు ఉంటాయని ఆయన
ఆదివారం నాడు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా
ఆదివారం నాడు ఎంపి విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్
పురోభివృద్ధి సాధించాలంటే, వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని, ఇందుకోసం మనమంతా
శాయశక్తులా కృషి చేద్దామంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.