వైయస్‌ఆర్‌సీపీలోకి బీజేపీ నేత ముద్దాడ మధు

1 Oct, 2018 11:26 IST
విజయనగరం: వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బీజేపీ నేత  ముద్దాడ మధు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వైయస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ  జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  పాదయాత్ర దేశ రాజకీయాల్లో మరెవ్వరికీ సాధ్యం కాని ఘనత ఆయన సాధించారన్నారు. వైయస్‌ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ అపూర్వమన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో టీడీపీ నేతలు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.