‘షర్మిల పాదయాత్ర చరిత్రాత్మకం’
3 Nov, 2012 11:53 IST
ముదిగుబ్బ:
ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చరిత్రాత్మకమైనదని వైయస్ఆర్సీపీ యువజన విభాగం వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో షర్మిల పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారని, రాజన్న కూతురిగా ఆదరిస్తున్నారని అన్నారు. అవినాష్రెడ్డి వెంట తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు.