ఎంపీ ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పాలి
18 Apr, 2017 12:53 IST
ప్రకాశంః తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని సంతనూతలపాడు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ సీనియర్ నేతలతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై ఎంపీ శివప్రసాద్ వాస్తవాలు మాట్లాడారన్నారు. చంద్రబాబు ఎస్సీలకు అన్యాయాలు చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు పరిపాలను సొంత పార్టీ నేతలే ఈసడించుకుంటున్నారన్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.