సోమవారం అసెంబ్లీ జరిగింది ఇలా

9 Mar, 2015 14:53 IST
హైదరాబాద్:  తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైన వెంటనే  విపక్షమిచ్చిన వాయిదా తీర్మానాల్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.  చాలా ముఖ్యమైన రైతు సమస్యలపై తాము తీర్మానాలు ఇచ్చామని, వాటిని తిరస్కరించడం భావ్యం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్  సభ్యులు పోడియంలోకి వచ్చారు.  రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు.